EPAPER

Kakinada Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

Kakinada Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

Kakinada Road Accident: ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. గండేపల్లి మండలం మురారి వద్ద ఓ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ బైక్ ను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వారి తల్లి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సంగలం దుర్గ (40)కు ముగ్గురు కొడుకులు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ఉన్నారు. కొడుకులతో కలిసి కూలిపనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కూలిపనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లిన నలుగురు.. బైక్ పై తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురారి శివారు ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అందరూ కిందపడిపోయారు.

Also Read : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి


పైకిలేచేలోపే వెనుకనుంచి వచ్చిన ఒక వాహనం బైక్ ను ఢీ కొట్టి వారి మీదినుంచి వెళ్లడంతో.. రాజు, ఏసు, అఖిల్ లు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×