భారత్ నుంచి షూటింగులో 21 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మరి మిగిలినవాళ్ల పరిస్థితిపై ఇప్పుడందరూ ఆరా తీస్తున్నారు. అయితే దురద్రష్టవశాత్తూ ఒక్కపాయింట్ తేడాతో సరబ్ జ్యోత్ సింగ్ ఫైనల్ కి క్వాలిఫై కాలేకపోయాడు. ఒకదశలో టాప్ 3లో ఉన్న సరబ్ జ్యోత్ చివరికి వచ్చేసరికి 577 పాయింట్లతో అనూహ్యంగా 9వ స్థానంలోకి పడిపోయాడు.
మరో షూటర్ పతకం తెస్తాడని భావించిన అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలోకి పడిపోయాడు. ఇకపోతే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ మెడల్ ఈవెంట్ లో కూడా మనవాళ్లు నిరాశపరిచారు. అంతేకాదు అర్జున్ -రమితా, సందీప్ సింగ్-ఇలవేనిల్ జోడీ కూడా వెనుకడు వేశారు. పతకం పోరుకు అర్హత సాధించలేకపోయారు.
అయితే చాలామంది అనేదేమిటంటే ఒలింపిక్స్ కి వచ్చి ఇక్కడ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడించే బదులు.. అవేదో ముందే నిర్వహిస్తే, సగం మంది అక్కడే ఫిల్టర్ అవుతారు, ఇంతదూరం రావడం శ్రమ దండగ అంటున్నారు. అప్పుడు ఒలింపిక్స్ నిర్వహించే వాళ్లకి శ్రమ తగ్గుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.