Ranbir Kapoor: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా బాలీవుడ్ మూవీ యానిమల్ ఏ స్థాయిలో హిట్టయ్యిందో.. అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో నటించిన పలు సన్నివేశాలను ఎత్తిచూపుతో హీరో రణబీర్ కపూర్ పై అభిమానులు, సినీ ప్రియులు, పలువురు నుంచి వ్యతిరేకత వచ్చింది. మరీ బోల్డ్ గా నటించి పరువు తీశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. యానిమల్ మూవీ విడుదల అనంతరం తోటి నటీనటులు కూడా హీరో రణబీర్ కపూర్ కు పలు సలహాలు ఇచ్చారంటా. మీరు ఇలాంటి సినిమాను తీసేదిలేకుండే.. ఇకముందు అలాంటి సినిమాలను తీయబోకండి అంటూ సలహా ఇచ్చారంటా.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు. ‘యానిమాల్ సినిమా తీయకముందు ఒకలా.. తీసిన తరువాత మరోలా తనపై ఒపీనియన్ ప్రేక్షకులకు కలిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ‘నేను ఎప్పుడు కూడా చాలామంచి పాత్రలు పోషించాను. మంచి సామాజిక సందేశాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే, యానిమల్ మూవీలో ఆ సీన్ వల్ల విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల తరువాత చాలామంది నన్ను కలిసినంక కొంత వ్యతిరేకత చూపించారు. ఆ సినిమా వల్ల మీ పట్ల చాలా నిరాశ చెందాము. అందువల్ల నేను నిశబ్ధంగా క్షమాపణలు కోరుతున్నాను. అలాంటి సీన్స్ మరోసారి చేయబోను. ఈ విషయంలో నేను ఎవరితోనూ వాదించను. మీకు నా పని నచ్చకపోతే క్షమించండి.. తదుపరిసారి మంచి మీకు నచ్చే పాత్రల్లోనే నటిస్తాను. మరింతగా కష్టపడి ఆ పాత్రల్లో నటించి మిమ్మల్ని మెప్పిస్తాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.