Bhadrachalam: ఎగువ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటమట్టం 53 అడుగల చేరువలో ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు.. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో సముద్రంలోకి 13.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలోని కోనసీమ గ్రామాలు ఇంకా గోదావరి వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంకవాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. దీంతో వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించి పరిశీలించారు. విలీన మండలాల్లో పర్యటించిన మంత్రులు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.