Diabetes Food Tips: ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా రకరకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, అధిక బరువు వంటి సమస్యలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని కారణం మారుతున్న జీవనశైలితో పాటు ఆహార పదార్థాలే ముఖ్య కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో షుగర్ పేషెంట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే షుగర్ బారిన పడిన వారు తమ ఆహార పదార్థాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా అసలు వీరు వైట్ రైస్ తినడం మంచిదేనా అనే విషయంపై చాలా మందికి అనుమానాలు ఉంటాయి. కొంత మంది అయితే వైట్ రైస్ తినడమే మానేస్తుంటారు. కానీ వైట్ రైస్ తింటూ కూడా షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరంలోని జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు శరీరానికి శక్తిని ఇచ్చి బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఇందులో విటమిన్ బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటివి మెండుగా ఉంటాయి. ఇందులోని సోడియం బీపీ సమస్య ఉన్నవారికి కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది. అయితే అన్నంను ఎలా వండుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు అన్నం వండే ముందు బియ్యాన్ని వేయించుకోవాలి. అంతేకాదు బియ్యంలో నీరు ఎక్కువగా పోసి వండుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. కొన్ని బియ్యం తీసుకుని ముందుగా చిన్న మంటతో బాగా వేయించుకోవాలి. దీని వల్ల బియ్యంలోని పిండి పదార్థాలు తగ్గిపోతాయి. దీని వల్ల అన్నం పొడిగా తయారవుతుంది. అంతేకాదు దీనిని తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. మరోవైపు షుగర్ పేషెంట్స్ అన్నం వండుకునే ముందు రెండు నుంచి మూడు సార్లు కడిగి అన్నం వండుకోవాలి. కడిగిన బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేసి తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండకుండా ప్రయోజనాలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.