Shocking Video: సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నా కూడా దొంగతనానికి సంబంధించిన వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. దొంగలు చేసే దొంగతనాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు. కానీ కొన్ని సార్లు దొంగలు చేసే పనులు మాత్రం విచిత్రంగా ఉంటాయి. దొంగల ప్రయత్నాలు, వారు చేసే పనుల గురించి తెలిసి చాలా మంది జాగ్రత్తలు పడుతుంటారు. ఇంట్లో నగదు, బంగారం జాగ్రత్తగా పెట్టి ఊర్లకు వెళుతుంటారు. అయితే ఇలా చేసినా కూడా దొంగలు వాటి వాసన పసిగట్టి అయినా ఇళ్లంతా ఊడ్చేసి వెళ్తుంటారు. కానీ దొంగతనానికి వెళ్లిన ఓ దొంగకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
ఎప్పటి మాదిరి తన దొంగతనంలో భాగంగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లో ఎవరులేని సమయం చూసి దొంగతనం చేసి సొమ్ము సంపాదిద్దాం అనుకున్నాడు. కానీ ఆ దొంగకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో షాకింగ్ దొంగతనం ఒకటి వెలుగుచూసింది. మహేశ్వరం మండల కేంద్రంలో ఓ ఇంట్లో దొంగ చోరీ కోసం వచ్చాడు. ఎవరు లేని సమయం చూసి ఇంట్లో దొంగతనం చేయాలని ప్రయత్నించాడు.
ఈ తరుణంలో నెమ్మదిగా ఇంట్లోకి ఎవరు చూడకుండా ప్రవేశించి ఇళ్లంతా దోచేయాలని అనుకున్నాడు. కానీ ఎంతో ఆశతో వెళ్లిన ఆ దొంగకు నిరాశే మిగిలింది. ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగకి ఏమి దొరకకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తరుణంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైపు చూస్తూ ‘ ఒక్క రూపాయి కూడా లేదు ‘ అంటూ సైగ చేస్తూ వెనుతిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు కూడా దొంగ ఆవేదన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఛ.. ఇంట్లో ఒక్క రూపాయి లేదు.. కెమెరా ముందు కష్టం చెప్పుకున్న దొంగ..!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఓ ఇంట్లో దొంగ చోరీ కోసం వచ్చాడు. అయితే ఇంట్లో ఏమి దొరకకపోవడంతో సీసీ కెమెరాల వైపు చూస్తూ ' ఒక్క రూపాయి కూడా లేదు ' అంటూ సైగ చేస్తూ వెనుతిరిగాడు. దానికి సంబంధించిన వీడియో… pic.twitter.com/N4rcMkbx6q
— BIG TV Breaking News (@bigtvtelugu) July 26, 2024