EPAPER

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Gold Smuggling| ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన ఒక ప్రయాణికుడు తన లగేజ్ తీసుకున్న తరువాత అటుఇటుగా చూపులు చూస్తున్నాడు. అతను కంగారుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక కస్టమ్స్ అధికారి గమనిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్ బయటకు వెళ్లే సమయంలో అతడిని పట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఏవో మాటలు జరిగాయి. ఆ తరువాత ప్రయాణికుడిని ఆ అధికారి టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన విషయం తెలిసి ఎయిర్ పోర్ట్ అధికారులంతా షాకయ్యారు.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో గల్ఫ్ దేశం నుంచి వచ్చిన ఇండిగో 6E-1346 విమాన ప్రయాణికుడు లగేజ్ తీసుకొని అనుమాస్పదంగా చూపులు చూస్తుండగా.. అతడిని కస్టమ్స్ ఆఫీసర్ వరుణ్ కౌండిన్యా గమనించాడు. ఆ ప్రయాణికుడి ముఖానికి చెమటలు పడుతున్నాయి. ఆఫీసర్ వరుణ్ ఆ ప్రయాణికుడి వద్దకు వెళుతుండగా.. అతను కూడా ఆఫీసర్ రాకను గమనించి ఎయిర్ పోర్టు బయటకు వెళ్లేందుకు త్వరగా నడుస్తున్నాడు. అయినా ఆఫీసర్ వరుణ్ అతడిని గ్రీన్ చానెల్ వద్ద పట్టుకున్నాడు.

ప్రయాణికుడిని పక్కకు తీసుకెళ్లి.. అతని లగేజ్, బట్టలన్నీ చెక్ చేశాడు. కానీ ఏమి కనబడలేదు. అయినా ఆఫీసర్ వరుణ్.. ఆ ప్రయాణికుడిని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో భయపడిపోయిన ఆ ప్రయాణికుడు తన వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని అంగీకరించాడు. గల్ఫ్ దేశం నుంచి తీసుకొచ్చిన్నట్లు చెప్పాడు. కానీ ఆ బంగారం ఎక్కడ ఉందో చెప్పలేదు. ఆఫీసర్ వరుణ్ ‌కు అనుమానం కలిగి అతడిని ఎయిర్ పోర్టు టాయ్ లెట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ ప్రయాణికుడి బట్టలు విప్పి చెక్ చేశాడు. కానీ ఏమీ దొరకలేదు. అయితే ఆ ప్రయాణికుడు తనంట తానే బంగారం ఎక్కడుందో చెప్పాడు.


Also Read: దారుణం.. బ్రతికుండగానే సజీవంగా పూడ్చిపెట్టిన వీడియో వైరల్

బంగారం తన మలద్వారంలో ఉందని తెలిపాడు. దీంతో ఆఫీసర్ వరుణ్ అతడినే స్వయంగా బయటికి తీసి ఇవ్వాలని ఆదేశించాడు. దీంతో ఆ ప్రయాణికుడు తన మలద్వారంలో ఉన్న బంగారాన్నీబయటికి తీశాడు. బంగారాన్ని మొత్తని పేస్టులా చేసి దాన్ని క్యాప్సూల్ రూపంలో మలద్వారంలో దాచాడు. కస్టమ్స్ ఆఫీసర్లు ఆ బంగారాన్ని తూకం వేయగా.. దాని బరువు 967 గ్రాములు ఉందని తేలింది. ఆ బంగారం విలువ దాదాపు 61 లక్షల రూపాయలు ఉంటుంది చెప్పారు. ఆ తరువాత ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు.

వారం రోజుల క్రితం కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే.. సౌదీ అరేబియా దేశం జెద్దా నుంచి వచ్చిన విమాన ప్రయాణికుడు తన మల ద్వారంలో నాలుగు క్యాప్సూల్ లో 1096.76 గ్రాముల బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. పట్టుబడ్డాడు. ఆ బంగారం విలువ రూ.69 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×