Flipkart Month End Mobile Fest Sale 2024: ఇటీవలే ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ ముగిసింది. ఈ సేల్లో చాలా ఉత్పత్తులను భారీ తగ్గింపులతో అందించింది. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మరో సేల్తో తిరిగొచ్చింది. ఫ్లిప్కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ 2024ని తీసుకొచ్చింది. ఈ సేల్ 5 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. సేల్లో అనేక బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను తగ్గువ ధరకే అందిచనుంది. ఫోన్లపై భారీ డీల్స్, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఫ్లిప్కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ 2024 సేల్ను ప్రత్యేకంగా మొబైల్స్ కోసమే తీసుకొచ్చింది. ఈ సేల్ 26 జూలై ఈ రోజు నుంచి 31 జూలై వరకు కొనసాగుతుంది. ఈ 5 రోజుల్లో మీరు స్మార్ట్ఫోన్ను చౌకగా కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశం ఉంది. డిస్కౌంట్తో పాటు ఫోన్పై డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీరు తక్కువ ధరకు కొనుగోలు చేయగల స్మార్ట్ఫోన్లు ఏమిటో చూడండి.
Poco M6 5G
ఈ స్మార్ట్ఫోన్ 6.74 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా సెటప్ కలిగి ఉంది. దీనిలో 5000 mAh బ్యాటరీ, MediaTek Dimension 6100+ ప్రాసెసర్ ఉంది. దీని 4 GB RAM + 64 GB ROM వేరియంట్ అసలు ధర రూ. 11,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రూ. 9,499కి కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై నేరుగా 20 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి 5 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు.
Also Read: బడ్జెట్ కింగ్.. పోకో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర ఎంతంటే?
Vivo T3 Lite 5G
ఈ స్మార్ట్ఫోన్ 6.56 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 50MP + 2MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై మొబైల్ రన్ అవుతుంది. దీని 4 GB RAM + 128 GB ROM వేరియంట్ అసలు ధర రూ. 14,499గా ఉంది. అయితే ఫ్లిప్కార్ట్లో రూ. 10,499కి కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై 27 శాతం డిస్కౌంట్ లభిస్తుంది మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి 5 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు.