YS Jagan Petition in AP High Court : ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 11 స్థానాల్లోనే గెలిచిన వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే.. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. కనీసం 10 శాతం సభ్యులుండాలి. అంటే ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు సాధించిన పార్టీకే ఆ హోదా ఉంటుంది. వైసీపీకి ఉన్నది 11 ఎమ్మెల్యేలే కావడంతో.. అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.
దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమ ఆ హోదాను ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ.. హై కోర్టును ఆశ్రయించారు. జగన్ వేసిన పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందో తెలియాలంటే మంగళవారం వరకూ వేచి చూడాల్సిందే.