Genocide Papua New Guinea: పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో దారుణం చోటుచేసుకుంది. జూలై 16 నుంచి 18 మధ్య మూడు గ్రామాలపై ఓ ముఠా ఒక్కసారిగా దాడి చేసిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దాడిలో 26మంది మృతి చెందారు. దుండగులు వీరిని అతికిరాతంగా నరికి చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
మూడు గ్రామాలపై ఓ ముఠా దాడి చేసి మృతదేహాలను చెల్లాచెదురుగా పడేశారు. ఇలా పడేయడంతో సమీపంలోని మొసళ్లు కొన్ని మృతదేహాలను సరస్సులోకి లాకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసే సమయంలో కొంతమంది పారిపోయారు. దుండగులు ఇళ్లను సైతం దహనం చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తలదాచుకున్నారని అధికారులు చెబుతున్నారు.
భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.