Suryakumar yadav about Gautam Gambhir(Sports news today): శ్రీలంక వేదికగా టీ20 సిరీస్ శనివారం నుంచి మొదలు కానుంది. కొత్త కోచ్లతో ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. దాదాపు నాలుగైదు గంటల సేపు ప్రాక్టీసులో నిమగ్నమయ్యాయి. మ్యాచ్ జరిగే మైదానాన్ని కూడా కోచ్ పరిశీలించారు. సాధనలో ఆటగాళ్లకు చెప్పాలిన మాటలు చెప్పేశాడు కోచ్ గౌతమ్గంభీర్.
తాజాగా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్ గౌతమ్ గంభీర్తో తన సంబం ధం చాలా స్పెషల్ అన్నాడు. ఐపీఎల్లో గంభీర్ ఆధ్వర్యంలో తాను మొదటిసారి ఆడానని, ఆయనతో నా బంధం చాలా గొప్పదన్నాడు. ఆట కోసం ఎలా పని చేస్తున్నానో.. తన ఆలోచనా విధానం గంభీర్కు పూర్తి తెలుసన్నాడు. ఈ విషయంలో ఎలాంటి దాపరికాలు లేవన్నాడు.
మరోవైపు టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా మనసులోని మాటను బయటపెట్టాడు. టీ20 మ్యాచ్ల్లో నా ప్రదర్శన సరిగా లేదన్నారు. ఈ విషయంలో తాను సంతృప్తి చెందలేదన్నాడు. గతంలో ఆడిన మ్యాచ్లను పరిశీలిస్తే అర్థమవుతుందన్నాడు. రాబోయే రోజుల్లో ఆటతీరును మెరుగుపర్చుకుని రాణిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తంచేశాడు.
ALSO READ: హర్బజన్ మాట.. పాక్కు వెళ్లకపోవడమే మంచింది, ఎందుకంటే..
కోచ్ గౌతమ్గంభీర్ మాత్రం గడిచిన రెండు సెషన్లో ఆటగాళ్ల ప్రాక్టీసును క్షుణ్ణంగా గమనించాడు. కొన్ని మెళుకువలు, సూచనలు ఇచ్చాడు. పరిస్థితి తగినట్టు మారిపోవాలని అన్నాడట. స్వదేశంలో ఆడే పిచ్ లు వేరని, విదేశాల్లో పిచ్లు డిఫరెంట్గా ఉంటాయని గుర్తు చేశాడు. బౌలర్ వేసే బాల్ను బట్టి మన మౌండ్ సెట్ మార్చుకుంటే సక్సెస్ కావచ్చని చెప్పుకొచ్చాడు. మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు మాత్రం ప్రాక్టీసు సెషన్లో ఉత్సాహం కనిపించారు.
SURYAKUMAR YADAV – CAPTAIN OF TEAM INDIA IN T20IS…!!! 🇮🇳pic.twitter.com/TzLLjZjzUJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2024