Viral Video: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏకంగా బ్రతికున్న ఇద్దరు మహిళలనే సజీవంగా పూడ్చిపెట్టాలని ప్రయత్నించారు. రహదాని నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారని అందుకే ఈ దారుణానికి యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గల మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. అయితే రోడ్డు నిర్మాణానికి మమతా పాండే, ఆశా పాండే అనే ఇద్దరు మహిళలు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో వారిద్దరిని కంకరతో సజీవంగా పూడ్చిపెట్టాలని ప్రయత్నించారు.
దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కంకర లోడ్తో ఇద్దరు మహిళలను సజీవంగా పూడ్చిపెట్టాలని ప్రయత్నించారు. ఈ తరుణంలో వారిని సగం వరకు పూడ్చిపెట్టగా, స్థానికులు వచ్చి ఆపేందుకు ప్రయత్నరించారు. వెంటనే వారిని రక్షించి చికిత్స కోసం సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించారు. దీంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు మహిళలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని పోలీసులు వెల్లడించారు. డంపర్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలిపారు. అయితే ఇందులో నిందుతులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో స్ధానికంగా దుమారం రేపుతోంది.
Two women were partially buried after the murrum was tipped over them from a truck while they were protesting against road construction in Madhya Pradesh's Rewa district.
Our system will never take any action against the culprits coz law and order only for poor people.#Rewa#MP pic.twitter.com/j7ngE6BP7u— 🕊️ (@morality_1st) July 21, 2024