Nandamuri Balakrishna: నందమూరి తారక రామారావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కల అనే సినిమాతో 30 ఆగష్టు 1974 న బాలయ్య మొట్టమొదటిసారి తెరపై కనిపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు బాలయ్య నిరంతరాయంగా నటిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 30 వస్తే బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకోనున్నాడు.
ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మొత్తం బాలయ్యకు ఘన సన్మానం చేయనున్నారట. సెప్టెంబర్ 1 న గచ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలుస్తోంది.
పవన్ ఒక్కడే కాకుండా ఈ ఈవెంట్కు సినీరాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు – పవన్ కళ్యాణ్, భట్టి మల్లు విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు పవన్- బాలయ్య ఒకే స్టేజిమీద కనిపించే మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
నిజం చెప్పాలంటే వేడుక మొత్తంలో పవన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రచారంలో బాలయ్య- పవన్ కలిసి కనిపించారు. మరోసారి ఈ వీరు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఏపీ డిప్యూటీ సీఎం గా ఒకరు.. ఎమ్మెల్యేగా మరొకరు.. ఏపీ అభివృధ్ధికోసం కృషి చేస్తున్నారు. మరి ఈ సన్మాన కార్యక్రమంలో పవన్- బాలయ్య ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి.