డ్యూయల్ టోన్ డిజైన్తో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్ దేశీయ మార్కెట్లో సందడి చేయడానికి వస్తోంది.
కంపెనీ తన బ్రాండ్ నుంచి Xiaomi 14 Civi లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేయనుంది.
ఈ ఫోన్ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది.
షియోమీ ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో లైవ్ అవుతుంది.
కొత్త పాండా డిజైన్తో స్మార్ట్ఫోన్ మైక్రోసైట్లో టీజ్ చేశారు.
ఇది జూన్లో మార్కెట్లోకి వచ్చిన Xiaomi 14 Civi వెర్షన్కు సమానమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.
స్మార్ట్ఫోన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్తో వస్తుంది.
Xiaomi 14 Civi లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ను జూలై 29 న భారతదేశంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.
రాబోయే వెర్షన్లో పాండా డిజైన్ ఉంటుందని మైక్రోసైట్లో క్లెయిమ్ చేస్తుంది.
ఇది డ్యూయల్-టోన్ ఫినిషింగ్ను కలిగి ఉంటుంది.