EPAPER

Mumbai Techie jumps off atal setu: ముంబై టెక్కీ.. అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య

Mumbai Techie jumps off atal setu: ముంబై టెక్కీ.. అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య

Mumbai Techie jumps off atal setu: ముంబైలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు. అటల్ సేతుపై నుంచి సముద్రంలోని దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మృతదేహం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తే..


బుధవారం మధ్యాహ్నం కరెక్ట్‌గా పన్నెండున్నర అవుతోంది. ముంబైలోని అటల్‌సేతు బ్రిడ్జిపై కారుతో ఓ వ్యక్తి వేగంగా వచ్చాడు. పక్కనే కారు ఆపి దానిపై నుంచి సముద్రంలోని దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు కరుతురి శ్రీనివాస్, వయస్సు 38 ఏళ్లు. డోంబ్లివాలి ప్రాంతంలో ఉంటున్నారు. శ్రీనివాస్‌కు మ్యారేజ్ అయ్యింది ఐదేళ్ల కూతురు కూడా ఉంది.

శ్రీనివాస్ గతంలో లోధా గ్రూప్‌లో పనిచేశాడు. కొన్నాళ్లపాటు కువైట్‌లో ఉన్నాడు. గతేడాది ముంబైకి తిరిగి వచ్చాడు. శ్రీనివాస్ ఓ వ్యక్తితో కలిసి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం ప్రారంభించాడు. మరి ఇద్దరి మధ్య విభేదాలు ఏంటో తెలీదుగానీ కువైట్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఫ్యామిలీ సభ్యులు సకాలంలో స్పందించడంతో బయటపడ్డాడు.


ALSO READ: డిప్యూటీ సిఎంతో భేటీ అయిన నటుడు దర్శన్ భార్య.. డికె శివకుమార్ ఏం చెప్పారంటే?..

మంగళవారం రాత్రి శ్రీనివాస్ తన బంధువులతో దాదాపు గంటలకు పైగానే మాట్లాడినట్టు  ఆయన భార్య చెప్పింది. మరి ఏమైందో తెలీదుగానీ చివరకు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణమని శ్రీనివాస్ కుటుంబసభ్యులు చెబుతున్నమాట.

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×