Minister Nara Lokesh Comments on Thalliki Vandanam: తల్లికి వందన పథకంపై శాసనమండలిలో మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లికి వందనం ఇస్తామంటూ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటూ లోకేశ్ తెలియజేశారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రభుత్వ బడుల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు.