Anasuya: యాంకర్ అనసూయ- విజయ్ దేవరకొండ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కారణం అనసూయ నటించిన సింబా సినిమా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పేరును వాడడమే. ఇక సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అదే ప్రశ్న అనసూయకి ఎదురయ్యింది.
ట్రైలర్ లో విజయ్ దేవరకొండ లాంటి మొగుడు రావాలని డైలాగ్ ఉంది.. ఇప్పుడు విజయ్కి మీకు మధ్య ఉన్న గొడవలు సమసిపోయినట్లేనా అని అడిగిన ప్రశ్నకు అనసూయ తనదైన రీతిలో సమాధానమిచ్చింది.
” ఇప్పుడు దానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు. సినిమాల ద్వారా ఎలాగైతే మెసేజ్లు ఇస్తారో.. నేను కూడా అలాగే మెసేజ్ ఇవ్వాలని ఆ విషయం గురించి రియాక్ట్ అయ్యాను. స్టేజ్ మ్యానర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్లైట్లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలి. ఆ పద్దతి అన్నది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
కొన్ని మితిమీరినప్పుడు అందరికి అర్థమవుతుంటాయి. ఆ రోజు ఎవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సివచ్చింది. అప్పుడు మీడియా కూడా ప్రశ్నించలేదు. మీదే తప్పు. సరే.. మీరు అడిగినా ఆయన ఏమన్నాడు. ఆమెనే అడగండి అని చెప్పాడు. నేను అలా ఎవరిని కించపరలేను. ఎవరిపై నాకు ద్వేషం లేదు. ఆ తర్వాత తప్పును ఎత్తు చూపించినందుకు నన్నే అందరూ తప్పుపట్టారు” అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ఈ ఘటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంతకుముందులా ప్రతిదానికి ఎగరడం లేదు… అలోచించి మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.