fishing vessel sinks: సౌత్ అట్లాంటిక్లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫాల్క్లాండ్ ఐలాండ్స్కు 320 కిలోమీటర్ల దూరంలో చేపల వేట సాగిస్తుండగా బోటు మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయం లో పడవలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు బోట్లు మరో 43 మందిని రక్షించినట్టు తెలుస్తోం ది. అందులో 10 మంది బోటుకు సంబంధించి సభ్యులున్నారు.
అయితే బోటు ఎలా, ఎందుకు మునిగి పోయిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సివుంది. ఘటన సమయంలో బోటు గంటకు 35 నాట్స్ వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా షిప్లు ఘటన జరిగిన ప్రాంతంలో మొహరించాయి. అంతేకాదు హెలికాప్టర్ల సాయం తీసుకున్నారు అధికారులు.
ALSO READ: చేతన సంచలన కామెంట్స్, భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే తెలీదు..
ఆఫ్రికా-దక్షిణ అమెరికా ఖండానికి మధ్య ఫాల్క్లాండ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ ప్రస్తుతం బ్రిటీషర్స్ ఆధీనంలో ఉన్నాయి. వీటిపై ఆధిపత్యం కోసం అర్జెంటీనా-బ్రిటీష్ సైనికులు 1982లో యుద్ధానికి దిగారు. ఈ ఘటనలో అర్జెంటీనాకు చెందిన 649 మంది, బ్రిటన్కు చెందిన 255 మంది సైనికులు మరణించారు. చివరకు ఈ వార్లో బ్రిటన్దే పైచేయి అయ్యింది.