Lalu Prasad Yadav health updates(Today latest news telugu): బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
అయితే, ఆస్పత్రిలో చేరిన లాలూ యాదవ్కు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. అతని చుట్టూ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగే ఆర్జేడీ నేత ప్రిన్స్ యాదవ్ కూడా లాలూ యాదవ్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్ పంచుకున్నారు.
ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అయితే గతకొంతకాలంగా లాలూ ప్రసాద్ యాదవ్ పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు సింగపూర్ లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.