EPAPER

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

Lalu Prasad Yadav health updates(Today latest news telugu): బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.


అయితే, ఆస్పత్రిలో చేరిన లాలూ యాదవ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. అతని చుట్టూ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగే ఆర్జేడీ నేత ప్రిన్స్ యాదవ్ కూడా లాలూ యాదవ్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్ పంచుకున్నారు.

ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అయితే గతకొంతకాలంగా లాలూ ప్రసాద్ యాదవ్ పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు సింగపూర్ లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×