Supreme Court Orders to High Court: సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అరుదైన కేసుల్లో మాత్రమే కోర్టులు బెయిల్ ఉత్తర్వలపై స్టే విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తొసిపుచ్చుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ల బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
మనీలాండరింగ్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే నిందితుడికి ఇచ్చిన స్వేచ్చలో కోర్టులు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ పై స్టే విధించే హక్కు కోర్టుకు ఉన్నా..ఇది అరుదైన, అసాధాారణ పరిస్థితుల్లో మాత్రమే చేయాలంటూ స్పష్టం చేసింది.
మనీ లాండరింగ్ కేసులో పర్వీందర్ సింగ్ ఖురానాకు ట్రయట్ కోర్టు గతేడాది జూన్ 17న బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు జూన్ 7న తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ కేసుపై పర్వీందర్ సింగ్ ఖురానా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
తాజాగా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి మళ్లీ పర్వీందర్ సింగ్ ఖురానా బెయిల్ ను పునరుద్దరించింది. బెయిల్ మంజూరు ఉత్తర్వులను అరుదైన కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని, బలమైన కారణాలు ఉంటే తప్పా బెయిల్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది.