EPAPER

Train : రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి..ఎలా రక్షించారంటే..?

Train : రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి..ఎలా రక్షించారంటే..?

Train : ఓ యువతి రైలు దిగే క్రమంలో అనూహ్యంగా ప్రమాదం బారిన పడింది. ఆ విద్యార్థి కళాశాలకు తొందరగా వెళ్లాలనే ఆతృతతో వేగంగా రైలు దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రైలుకు -ఫ్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కుపోయింది. దాదాపు గంటన్నరపాటు నరకయాతన అనుభవించింది. చాలాసేపు ఆమెను పైకిలాగేందుకు రైల్వేసిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అతికష్టంమీద ఆమెను రక్షించారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో జరిగింది.


అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. ఆ రైలు దువ్వాడ స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఆ యువతి ప్రమాదం బారిన పడింది. స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె ఇరుక్కున్న చోట ఫ్లాట్‌ఫామ్‌ను కట్‌ చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి శశికళను బయటకు తీశారు.

బాధితురాలు శశికళను వెంటనే చికిత్స కోసం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రమతో ఆ యువతి ప్రాణాలు దక్కించుకుంది. ఈ ఘటనతో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది.


Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×