Kareena Kapoor latest news(Bollywood celebrity news): నాలుగు పదుల వయసు దాటినా ఇంకా నేను ఈ తరం కథానాయికలతో పోటీ పడగలనని చెబుతున్నారు కరీనా కపూర్. ఒకప్పటి అగ్ర తార. అప్పట్లో నేను కూడా భారీ తరహాలో పారితోషికం అందుకునేదానిని చెబుతున్నారు. అలాగని పారితోషికం ఎక్కువగా రావాలని కోరుకోనంటున్నారు. ముందుగా కథ నచ్చాలి. అందులో నా పాత్ర నచ్చాలి. అలాంటప్పుడు రెమ్యునరేషన్ గురించి అస్సలు పట్టించుకోనంటున్నారు. ఇది నేను తొలి సినిమా నుంచి అలవరుచుకున్న గుణం అంటున్నారు. కొన్ని సినిమాలు సందేశాత్మకంగా, ఆలోచన కలిగించేలా సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాంటి సినిమాలకు నేను తొలి ప్రాధాన్యతనిస్తుంానని అన్నారు. ఇప్పుడొచ్చే కథానాయికలు కేవలం పారితోషికం మాత్రమే ఆశిస్తున్నారు. నటనకు ప్రాధాన్యతనిచ్చే వాటి జోలికి వెళ్లనని చెబుతున్నారు. మనం నటించే సినిమాలు జమాజంపై ప్రభావం చూపేలా ఉండాలనేది నా అభిప్రాయం.
ఆరోగ్య నియమాలు
వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇప్పటికీ తాను జిమ్ కు వెళతానని..ఆరోగ్య నియమాలు పాటిస్తానంటున్నారు. అదే తన అసలైన సీక్రెట్ అంటున్నారు. పైగా సినిమా రంగంలో ఓ వయసు వచ్చాక వాళ్లను అమ్మ పాత్రలకూ అత్త పాత్రలకూ అంటగడుతుంటారు. నటించే సామర్థ్యం ఉన్నప్పుడు ఛాలెంజింగ్ రూల్స్ చేయించవచ్చు కదా వాళ్లతో. ఇప్పటికీ తాను అలాంటి పాత్రలు వస్తే ఈ తరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా చేస్తానంటున్నారు కరీనా కపూర్. సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఏవేవో పేర్లు పెడుతున్నారు అలాంటివి తనకు నచ్చదని అంటున్నారు. ప్రస్తుతం కరీనా ‘ది బకింగ్ హోమ్ మర్డర్స్ ’ మూవీలో నటిస్తున్నారు.