Pregnant woman murder in Madhya Pradesh(Telugu flash news): కాలం మారుతున్న వరకట్నం కోసం వేధించే వాళ్లు అస్సలు మానుకోవడం లేదు. తరుచూ ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరకట్న వేధింపుల వల్ల ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన, కఠిన శిక్షలు విధించినా ధనదాహంతో అమాయికుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్ లోని వరకట్న వేధింపులకు నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం తరుచూ కోడలిని వరకట్నం తీసుకురమ్మని వేధిస్తూ ఉండేవారు. ఆమె భర్త కూడా కట్నం కోసం తరుచూ చిత్ర హింసలు పెట్టేవాడు.
Also Read: సనత్నగర్లో విషాదం.. ముగ్గురు మృతి
నిండు గర్బిణి అని చూడకుండా చిత్రహింసలు పెట్టి కాళ్లు చేతులు నరికి మృతుదేహాన్ని తగలబెట్టారు. దీంతో అక్కడి స్థానకులు ఆమె తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకోగా అప్పటికే ఆమె శరీరం సగం కాలిపోయి విగతజీవిగా పడి ఉండడంతో వారిరోదనలు మిన్నంటాయి. వరకట్నం కోసమే తమ కూతుర్ని బలి తీసుకున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకోగా మృతురాలి భర్త, అతడి కుటుంబ సభ్యులు పరార్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.