Violent in Mali Central region(Today’s international news): ఆఫ్రికాను చీకటి ఖండమని అంటారు. ఇక్కడ ఏదో దేశంలో నిత్యం హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. మధ్య, ఉత్తర మాలి గురించి చెప్పనక్కర్లేదు. దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఒకప్పుడు అధికారంలో తీవ్రవాద ముఠాలు ఉండేవి. వారి ఆగడాలు తట్టుకోలేక ఫ్రెంచ్ సైన్యం సాయంతో ఆ దేశ భద్రతా బలగాలు వారిని తరిమికొట్టాయి. ఇక వారి పనైపోయిందని అందరూ భావించారు. వారంతా గ్రూప్గా ఏర్పడి గ్రామాలు, సైనికులపై దాడులకు తెగబడుతున్నారు. వీరికి అల్ఖైదా నుంచి అండదండ లున్నట్లు తెలుస్తోంది.
తాజాగా మాలి దేశంలో దుండగులు 26మందిని బలి తీసుకున్నారు. సెంట్రల్ మాలి సరిహద్దు బుర్కినా ఫసోతో కలిగివుంది. అయితే సోమవారం డెంబో గ్రామంలో ప్రజలు పొలాల్లో పనులు చేసుకుంటుండగా దుండగులు ఒక్కసారిగా తెగబడ్డారు.
ALSO READ: అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఈ ఘటనలో 26 మందిని చంపేశారు. దీనికి అక్కడి ఏ గ్రూప్ బాధ్యత వహించలేదు. సాధారణంగా మాలి లో గ్రామీణ ప్రజలపై అల్ఖైదాకు అనుబంధంగా పని చేస్తున్న జేఎన్ఐఎం గ్రూప్ ఉంది. వీళ్లు తరచూ గ్రామాలపై పడి అక్కడి ప్రజలను హింసించి చంపేస్తున్నారు. ఈనెలలో ఓ మ్యారేజ్ వేడుకల్లో 21మందిని పొట్టనబెట్టుకుంది. తాజా దాడి కూడా వారి పనేనని అక్కడి ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేస్తోంది.