India women beat UAE-W by 78 Runs: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో టీమిండియా వరుసగా మరోసారి గెలిచింది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు తీసింది. అయితే, టీ20ల్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
యూఏఈ జట్టులో కవిషా 40 పరుగులు తీసింది. అందులో 32 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ తీసింది. రోహిత్ ఓజా (38 – 36 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లు), తీర్థ సతీష్ -4, రినిత -7, సమైరా ధరణిధర్క -5, ఖుషీ శర్మ -10, హీనా -8 పరుగలు తీశారు.
భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీప్తి శర్మ -2 వికెట్ల తీయగా, రేణుకా సింగ్, కన్వర్, పుజా వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు.
Also Read: కోచ్ గౌతం గంభీర్ సహాయకులు వీరేనా?
టీమిండియా ప్లేయర్లు.. హర్మన్ ప్రీత్ కౌర్ (66 – 47 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్లు), రిచా ఘోష్ (64- 29 బంతుల్లో 1 సిక్స్, 12 ఫోర్లు), ఓపెనర్ షఫాలీ వర్మ(37 – 18 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (14), స్మృతి మంధాన (13) పరుగులు తీశారు. కాగా, భారత్ 4.2 ఓవర్లకే 52 పరుగులు చేసింది. తరువాత వరసుగా రెండు వికెట్లను కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన హర్మన్ ప్రీత్.. జెమీమాతో కలిసి జట్టును ఆదుకుంది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రిచా ఘోష్ బౌండరీలతో అదరగొట్టింది.
యూఏఈ బౌలర్లు.. కవిషా 2 వికెట్లు తీయగా, హీనా, సమైర తలో వికెట్ పడగొట్టారు.