Janhvi Kapoor: ఆస్పత్రి నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ డిశ్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. కాగా, ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా జాన్వీ కపూర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఆస్పత్రిలో చేర్పించామని, ఆరోగ్యం మెరుగుపడడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చామని బోనీ కపూర్ మీడియాతో చెప్పాడు.
సినిమా విషయానికొస్తే.. వరుస సినిమాలతో జాన్వీకపూర్ దూసుకెళ్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూతో కలిసి నటించిన మూవీ ‘ఉలఝ్’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక తెలుగు దేవరతో ఎంట్రీ ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో రానున్న చిత్రంలోనూ జాన్వీకపూర్ నటించనుంది.