40 Haitian migrants die: హైతీ దేశానికి చెందిన దాదాపు 80 మందితో వెళ్తున్న బోటు సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 40 వరకు మృతిచెందారు. మరో 40 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.
ఉత్తర హైతీలోని సెయింట్ మిచెల్ పోర్టు నుంచి 80 మందితో బయలుదేరింది ఈ పడవ. కాయ్ కోస్, టర్క్స్ నగరానికి ఈ బోటు వెళ్తోంది. ఈ విషయాన్ని కరేబియన్ మైగ్రేషన్ అధారిటీ వెల్లడించింది. గాయపడిన 11 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బోటు ట్రావెల్ సమయంలో అందులోని కొందరు వెళ్తున్న మార్గం కోసం కొవ్వొత్తులను వెలిగించడానికి అగ్గిపెట్టెను ఉపయోగించారు. గాలికి కొవ్వొత్తులు కింద పడడంతో బోటులోని గ్యాసోలిన్తో నింపిన డ్రమ్ములకు అంటుకుందని అంటున్నారు. దీని కారణంగానే పేలుడు సంభవించి బోటు తగలబడి పోయిందన్నది క్షతగ్రాతులు చెబుతున్నారు. మృతి చెందినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: అమెరికాకు భారత కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా
హైతీని ఆ దేశ ప్రజలు విడిచిపెట్టడానికి కారణాలు లేకపోలేదు. కొన్ని నెలలుగా అక్కడ కొన్ని గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. హింసకు దిగుతున్నాయి.. దీని ఫలితంగా అక్కడి ప్రజలు చిన్నారులను పట్టుకుని బోట్లపై పొరుగుదేశాలకు వలసపోతున్నారు. ఈ క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ఒక్క జూలైలో వందలాది మంది కెన్యా, మిగిలిన దేశాలకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నమాట.