Satya Nadella’s first reaction: మైక్రోస్టాప్ విండోస్లో సాంకేతిక సమస్య ఏంటి? ప్రపంచవ్యాప్తంగా పలు సర్వీసులు అంతరాయానికి కారణమేంటి? దీనికి కారణంగా ఎవరు? శుక్రవారం ఒక్కరోజు కొన్నిగంటలపాటు తలెత్తిన సమస్యకు కారణం ఎవరు? విండోస్కు ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
మైక్రోస్టాప్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన, బ్యాంకులు, ఐటీ, హెల్త్ కేర్ సంస్థల వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వినియోగదారులు, వివిధ కంపెనీల యాజమానులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కంప్యూటర్ల లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టమ్స్ షట్డౌన్, రీస్టార్ట్ అయ్యాయి. క్రౌడ్ స్టైక్ అప్డేట్ చేయడంతోనే సాంకేతిక సమస్య తలెత్తిందన్నది ఆ కంపెనీ చెబుతున్నమాట.
తాజాగా ఈ సమస్య మైక్రోస్టాప్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల తొలిసారి రియాక్ట్ అయ్యారు. క్రౌడ్ స్టైక్ అప్ డేట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్స్ల్లో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. దీనికి సంబంధించిన సమస్య గురించి తెలుసుకున్నామని, క్రౌడ్ స్టైక్తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కస్టమర్లకు అవసరమైన సాంకేతిక సహాయం, సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎక్స్లో చెప్పుకొచ్చారాయన.
ALSO READ: మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అంటూ ఎలాన్ మస్క్ సెటైర్
ఈ సమస్యపై స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ రియాక్ట్ అయ్యారు. దీన్ని ఆటోమోటివ్ సరఫరా గొలుసును దిగ్భంధించిందంటూ వ్యాఖ్యానించారు. ఇక నెటిజన్స్, సిస్టమ్స్ నిఫుణులు సైతం రకరకాలుగా స్పందిం చారు. మొత్తానికి సమస్య సాల్వ్ కావడంతో మైక్రోస్టాఫ్ ఛైర్మన్ సత్య నాదెళ్ల ఊపిరి పీల్చుకున్నారు.
Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.
— Satya Nadella (@satyanadella) July 19, 2024