Three College Students Died: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు కుత్భుల్లాపూర్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Also Read: ఫేక్ పోలీసు డీపీ..పెడతారు నెత్తిన టోపీ
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్థులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులకు మృతల వివరాలను తెలియజేయగా వారు బోరున విలవిపిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తారనుకుంటే ఇలా ప్రమాదానికి గురై తమను వదిలి వెళ్లారంటూ గుండెలవిసేలా దు:ఖిస్తున్నారు.