Also Read: రెబెల్స్ ఆఫ్ కల్కి.. మరో యాక్షన్ విజువల్ వండర్ వీడియో రిలీజ్
కానీ పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. జూలై 18న ఆమె కన్నుమూసింది. ఈ విషయాన్ని తీషా కుటుంబ సభ్యులు ఇవాళ (జూలై 19) తెలియజేశారు. దీంతో ఆమె మరణ వార్త విని అంతా షాకైపోతున్నారు. ఇంత చిన్న వయసులో క్యాన్సర్తో చనిపోవడమేంటని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆమె మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కూతురిని కాపాడుకోలేకపోయామే అంటూ బోరున విలపిస్తున్నారు.
ఆమె మరణంపై ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె పార్థివదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్. దీన్ని భూషణ కుమార్ చూసుకుంటున్నాడు. అయితే ఆయనకు కృష్ణ కుమార్ వరుసకు చిన్నాన్న అవుతాడు. ఈయన ప్రస్తుతం టీ సిరీస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నాడు. కృష్ణ కుమార్ 1995లో బేవఫా సనమ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించి అదరగొట్టేశాడు. కానీ ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి నిర్మాతగా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్లు అందుకున్నాడు. ఇటీవలే ‘యానిమల్’ సినిమా తీసి మంచి లాభాలు పొందాడు.