YouTuber Praneeth Hanumanthu NDPS case: యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై మరో కేసు నమోదైంది. తండ్రి, కూతురు బంధంపై ఇటీవల అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా, ఆయనపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గంజాయి తీసుకున్నట్లు తేలడంతో హనుమంత్పై ఎన్డీపీఎస్ కేసు నమోదైంది.
ప్రణీత్ హనుమంత్ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు కొన్ని రోజుల కిందట అరెస్ట్ చేశారు. అయితే తనిఖీ చేసిన పోలీసులు ఆయనకు మెడికల్ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ టెస్టులో ప్రణీత్ హనుమంత్కు పాజిటివ్ వచ్చింది. మత్తు పదార్థాలతో పాటు గంజాయి సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు.
గంజాయి తీసుకుంటున్నట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో ఆయనపై సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్ కింద మరో కేసు నమోదు చేశారు. కాగా, ప్రణీత్ హనుమంత్పై ఇప్పటికే పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రణీత్ చంచల్ గూడ జైలులో ఉన్నారు.
Also Read: బాలయ్య ఓనెల రోజులు రాజస్థాన్ లోనే మకాం..ఎందుకో తెలుసా?
ఇదిలా ఉండగా, మూడు రోజులపటు కస్టడికి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రణీత్ న్యాయవాదికి సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ప్రణీత్ హనుమంత్ను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.