Pakistan: పాకిస్థాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను లక్ష్యంగా చేసుకుంది. రెండు రోజులుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వినియోగంలో యూజర్లకు ఇబ్బంది ఎదురవుతున్నాయి. అంతే కాకుండా మరికొందరి వాట్సప్ వంటి యాప్ల యాక్సిస్లో సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా సామాజిక మాధ్యమాలను తాత్కాలికంగా పాకిస్థాన్ నిషేధించింది. తాజా పరిణామాలతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అక్కడి సైన్యం మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిషేధ ఆంక్షలు విధించడం గమనార్హం. అయితే ఈ ఆంక్షలపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తొమ్మిది రోజుల పాటు పంజాబ్లో యూట్యూబ్, వాట్సాప్ ,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలని నవాజ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Also Read: ట్రంప్పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్
హింసకు దారితీసే తప్పుడు ప్రచారాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్ యాక్సిస్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రోజులుగా ఈ సమస్య నెలకొంది. అయితే ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ కంపెనీ వెల్లడించింది.