Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాస్పిటల్ లో చేరింది. ఆమెకు ఫుడ్ పాయిజన్ కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించారు. ఈ విషయాన్నీ జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్దారించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, 2 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు.
ఇక ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కావడంతో జాన్వీ బాగా ఇబ్బందిపడుతుండడంతోనే హాస్పిటల్ వరకు వెళ్లాల్సివచ్చిందని తెలుస్తోంది. వైద్యులు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.
ఇక జాన్వీ కెరీర్ విషయానికొస్తే తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే దేవర సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే RC16 సినిమాలో ఛాన్స్ పట్టేసింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. ఈ మధ్యనే నాని సినిమాను కూడా ఫైనల్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
ఇంకోపక్క హిందీలో ఉలాజ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి హైప్ నే తీసుకొచ్చింది. జాన్వీ హాస్పిటల్ వార్త విన్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.