EPAPER

Kakani Govardhan: టీడీపీ అధికారంలో వైసీపీపై దాడులు పెరిగాయి: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan: టీడీపీ అధికారంలో వైసీపీపై దాడులు పెరిగాయి:  కాకాణి గోవర్ధన్

Kakani Govardhan: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ ఆరోపించారు. కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతే కాకుండా నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా హతమార్చారు. వ్యక్తిగత వివాదాలే అతడి హత్య జరిగిందని చెప్పడం దారుణం. రషీద్ హత్యపై ఎస్పీ తీరు సరికాదు. రషీద్‌ను హత్య చేసిన వ్యక్తి పేరు జిలానీ. అతడు టీడీపీకి చెందిన కార్యకర్త, రసీద్ హత్యకు సూత్రదారులను పోలీసులు గుర్తించాలని కాకాణి అన్నారు.


మాజీ లోక్ సభ సభ్యుడు రెడ్డెప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళితే టీడీపీ నేతలు అతడిపై దాడులకు పాల్పడ్డారు. చివరకు మాథున్ రెడ్డి గన్‌మెన్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి. మూడు వేల కుటుంబాలు గ్రామాలను వదిలి వలస వెళ్లారని ఆరోపణలు చేశారు.

Also Read: పిన్నెల్లికి హైకోర్టులో షాక్.. బెయిల్ నిరాకరణ


రాష్ట్రంలో మహిళలు, మైనర్లలపై అఘాయిత్యాలు కూడా అధికమయ్యాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత మాటలు చూసి ఎంతో మురిసిపోయారు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో కూడా కనబడటం లేదు. వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి. పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వైసీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి పాలన ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇదేనా వీళ్లు చేస్తున్న పాలన అని ప్రశ్నించారు.

Tags

Related News

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Big Stories

×