Visakhapatnam news today telugu(AP latest news): ప్రియురాలి మోజులోపడి కట్టుకున్న భార్యని నిర్లక్ష్యం చేశాడు ఆమె భర్త. మరో యువతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పులు రావడం గమనించింది భార్య. యువతితో రొమాన్స్ చేస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. బంధువుల సాయంతో ఇద్దర్నీ పట్టుకుని కుమ్మేసింది. సంచలనం రేపిన ఈ వ్యవహారం విశాఖలో వెలుగుచూసింది.
విశాఖ సిటీకి చెందిన వివేక్ కొన్నాళ్ల కిందట హరిత అనే యువతిని ప్రేమించాడు. పెద్దల సమక్షంలో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఇంతవరకు బాగానే నడిచింది. వివేక్ అంత తెల్లగా లేకపోయినా తన అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు స్పా కు వెళ్లడం మొదలు పెట్టాడు.
అక్కడ ఓ యువతితో వివేక్కు పరిచయం ఏర్పడింది. యువతి సీతమ్మధారలో ఉంటోంది. పరిచయం కాస్తా ఫ్రెండ్ షిప్గా మారింది. ఆమె మీద మోజుతో విలువైన వస్తువులు బహుమతులు ఇచ్చాడు వివేక్. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్కులు, బీచ్లు, హోటల్స్లో ఎంజాయ్ చేశారు. చివరకు వివేక్- ప్రియురాలి మధ్య అంతర్గత రిలేషన్స్కు దారి తీసింది. ఒక్కోసారి వివేక్ ఇంటికి వచ్చేవాడు కాదు.
వివేక్ వ్యవహార శైలిని గమనించింది భార్య హరిత. రోజురోజుకూ మార్పులు రావడం గమనించింది. ఆఫీసు కు వెళ్లినట్టుగా టైమ్కు బయటకు వెళ్లిపోవడం, గట్టిగా ప్రశ్నిస్తే ఆఫీసులో బిజీ అని చెప్పి తప్పించు కోవడం మొదలుపెట్టారు. వివేక్ పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వాకబు చేసింది భార్య హరిత. ఆ తర్వాత భర్త ఎక్కడకు వెళ్తున్నాడు? ఎవరితో సమావేశం అవుతున్నాడు అనేదానిపై ఓ కన్నేసింది.
ALSO READ: ఎర్రమట్టి దిబ్బల్లో ఎరుపెక్కిన రాజకీయం
గురువారం ఉదయం ప్రియురాలితో బెడ్రూమ్లో ఉన్నాడు వివేక్. ఈ రూమ్కి ఎవరు రారని భావించి వాళ్ల పనుల్లో వారు నిమగ్నమయ్యారు. వివేక్ రూమ్కి వెళ్లిన పావుగంటకు భార్య హరిత, ఆమె బంధువులు అక్కడి కి చేరుకున్నారు. వారిద్దరినీ బెడ్ మీద చూసి షాకయ్యారు. బంధువుల సాయంతో హరిత, ప్రియురాలిని కుమ్మేసింది. అటు భర్తను కూడా వదల్లేదు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది భార్య హరిత. తన న్యాయం చేయాలని పోలీసులను కోరింది. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.