EPAPER

Akhilesh Yadav: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట:  అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బీజేపీ ప్రభుత్వం యూపీలో ఆదిత్య నాథ్ సారధ్యంలో అస్థిరతతో సతమతం అవుతోందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటతో కీచులాడుతోందని అన్నారు. కాషయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని మండిపడ్డారు. అంతే కాకుండా రాష్ట్ర రాజధాని లక్నోలో గృహాల కూల్చివేత నిర్ణయాలన్ని వాయిదా వేసారని అన్నారు.


యోగి సర్కార్ బలహీనపడుతుందనేది విస్పష్ట సంకేతమని చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేధాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. మరో వైపు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు.

అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు. 2015 ఎన్నికల ఫలితాలు 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం యూపీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు, ఈ నేపధ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించడానికి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది.


Also Read: గోడ దూకివచ్చిన ఫ్లైయింగ్ స్క్వాడ్.. అడ్డంగా దొరికిన టీచర్లు

మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలను సమాజ్ వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 35 స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×