3 People, including Software Engineer, died: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ సహా ముగ్గురు మృతిచెందారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఇతర వార్తా కథనాల ప్రకారం.. రాజు, శ్రీపాల్ రెడ్డి.. వీరిద్దరూ స్నేహితులు. వీరు హైదరాబాద్లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అయితే, మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి తమ కుటుంబాలతో వీరు హాజరయ్యారు.
Also Read: ఉప్పొంగి ప్రవహిస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న బోగత జలపాతం
బుధవారం ఉదయం శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కుమార్తె అక్కడ ఉన్న క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె ఆ క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్రెడ్డి, రాజు అందులోకి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో ముగ్గురూ కూడా మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.