Andhra Pradesh Cabinet Meeting Concludes: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు పూర్తయిన సందర్భంగా.. నెలరోజుల పనితీరుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇక కేబినెట్ భేటీ అనంతరం.. సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చాలాసేపు చర్చించారు. మంత్రులకు కేటాయించిన శాఖల మీద ప్రతి నెలా సమీక్షలు చేయాలని, ఎప్పటికప్పుడు తమ శాఖల పరిస్థితిని జనానికి తెలియజేయాలంటూ వారికి సూచించినట్లు సమాచారం. నూతన ఇసుక పాలసీలో జోక్యం చేసుకోవొద్దని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. బోట్ సోసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చంద్రబాబు.. మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే…
Also Read: Three new airports in AP: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?