Tobacco Adds in Cricket Stadium : భారతదేశంలో యువత మాదకద్రవ్యాలకే కాదు, సిగరెట్, మద్యం, గుట్కా తదితర వ్యసనాలకు బానిసైపోతోంది. ఇది భావి భారత దేశానికి మంచిది కాదు. యువత నిర్వీర్యమైతే దేశ ప్రగతి క్షీణిస్తుంది. ఇవన్నీ ఆలోచించి క్రికెట్ స్టేడియంలలో పొగాకు సంబంధిత యాడ్స్ నిషేధించాలని ఆలోచిస్తోంది. అందుకు తగినట్టుగా బీసీసీఐకు కేంద్రం ఆదేశాలు జారీ చేయనుందేనే వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ మసాలా, పొగాకు చూయింగ్ గమ్స్, పొగ లేని పొగాకు ఉత్పత్తులు, గుట్కా ఇలా ఎన్నో యువతను అట్రాక్ట్ చేసే మాయదారి ప్రకటనలను క్రికెట్ మైదానాల్లో నిషేధించాలని భారత ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే క్రికెటర్లు, సినీ యాక్టర్లు కూడా పాన్ పరాగ్, గుట్కా, సిగరెట్, మద్యం తదితర ప్రకటనల్లో నటించవద్దని ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఇప్పటికే మహేష్ బాబులాంటి యువ నటులు మద్యం ప్రకటనల్లో నటించడం మానేశారు. ఎందుకంటే తను తాగమని యాడ్ చేస్తే, అభిమానులు రెచ్చిపోయి మందు కొడతారని భావించి చాలామంది నటీనటులు సామాజిక బాధ్యతగా అలాంటి ప్రకటనల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.
Also Read : అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్
ఇంకా ఒకవేళ కొందరు నటీనటులు, క్రికెటర్లు చేస్తున్నా వారిపై ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించనుంది. ఈ ప్రకటనల ద్వారా పొగాకు ఉత్పత్తులను తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశ యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో సందేహమే లేదని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.
కొన్ని అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనాల ప్రకారం… పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలను మొన్న టీ20 ప్రపంచకప్ సిరీస్ లో ప్రసారం చేశారు. ఏటా 1.35 మిలియన్ల మంది వివిధ రూపాల్లో పొగాకు తీసుకుంటున్నారు. వీరిలో 2019-22 మధ్య కాలంలో కోటిమందికి పైగా మరణించారు. అందుకే ప్రజారోగ్యం ద్రష్ట్యా కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.