Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం అందుకున్న రోజు నుంచి ఇప్పటివరకు ఆయన నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలు చూపుతున్నారు. ఇక నిన్ననే అనంత్ అంబానీ రిసెప్షన్ కు ముంబై వెళ్లి న పవన్ నేడు విజయవాడలో అడుగు పెట్టారు.
అయితే ఆయనతోపాటు ఎయిర్ పోర్ట్ లో పవన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కనిపించారు.అయితే ఎందుకు ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కలిశారు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. పవన్ ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ఇద్దరూ ఎంతో హెల్ప్ చేశారు.
ఇక పవన్ ఎన్నికల విజయం తరువాత త్రివిక్రమ్ సినిమాలు వదిలేసి పవన్ కు సలహాదారుడిగా ఉంటున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కొట్టి పారేశారు. దీంతో అప్పట్లోనే ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇక ఇప్పుడు పవన్ వెనుక త్రివిక్రమ్ కనిపించడంతో మళ్లీ ఆ పుకార్లు మొదలయ్యాయి.
ఇకపోతే తొలిప్రేమ సినిమా నుంచి హార్ట్ డైరెక్టర్ సాయితో పవన్ కు స్నేహబంధం కొనసాగుతుంది. పవన్ ప్రమాణ స్వీకార రోజున కూడా అసెంబ్లీలో ఆనంద్ సాయి కనిపించాడు. మరి ఈ ముగ్గురు కలిసి వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా లేకపోతే పవన్ ను నార్మల్గానే కలిశారా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే పవన్ సినిమాల విషయానికొస్తే త్వరలోనే ఆయన మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టనున్నారని సమాచారం. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలను ఆయన ఎప్పుడు ఫినిష్ చేస్తారో చూడాలి.