MLA Vivekananda gives Clarity on Party Change Rumors: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్పందించారు. ఈ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాని చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ను ముందు తానే వేశానంటూ గుర్తుచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటు పడుతుందన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనంటూ స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా ఈ వలసలపై చర్చ కొనసాగుతుంది. గతంలో ఏకచక్రాధిపత్యం చేసిన కేసీఆర్ ను తన సొంత ఎమ్మెల్యేలు నమ్మడంలేదా..? లేక వారు పార్టీ మారకుండా కాపాడుకోలేకపోతున్నారా..? అంటూ చర్చించుకుంటున్నారు.
Also Read: కేసీఆర్కు మరో షాక్.. నేడు కాంగ్రెస్లో చేరనున్న మరో ఎమ్మెల్యే
వివేకానంద విషయంలో కూడా జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది ముందుగా ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఇదేవిధంగా చెప్పారని.. ఆ తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటున్నారు. వివేకానంద విషయంలో ఇలాగే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు జనాలు.