Kanchikacharla quarry: ఉమ్మడి కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ జారీ డ్రిల్లింగ్ చేస్తున్నవారిపై బండరాళ్లు పడ్డాయి. స్పాట్లో ముగ్గురు మృతి చెందారు.
పరిటాల క్వారీపై కార్మికులు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి బండరాళ్లు కిందపడ్డాయి. పెద్ద రాయి కింద పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ వర్షం పడడంతో సహాయకచర్యలకు అంతరాయం ఏర్పడింది.
మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సివుంది.