WAR-2 Movie Makers Are Building A Huge Set in Hyderabad For Action Seens: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నాడు.ఓ వైపు దేవర, మరోవైపు వార్-2 బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక తాజాగా దేవర మూవీ షెడ్యూల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ వార్2 సెట్స్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక వార్ మేకర్స్ ప్రస్తుతం ఓ సాలిడ్ యాక్షన్ సీన్స్ షూట్ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారట.
అంతేకాకుండా ఆగష్టు నెలలో ఈ సెట్లో యాక్షన్ సీక్వెన్స్ను హీరోలు ఎన్టీఆర్ హృతిక్ రోషన్లపై ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్.పైగా ఈ మూవీ సీక్వెన్స్లో హీరోలిద్దరితో పాటు మూవీలో యాక్ట్ చేస్తున్న ముఖ్యమైన నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని టాక్.అలాగే ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్లో జాన్ అబ్రహం గెస్ట్ అప్పీరెన్స్గా ఎంట్రీ ఇవ్వనున్నాడట.అంతేకాకుండా హైదరాబాద్లో జరగబోయే మూవీ షెడ్యూల్లో ఈ హీరో కూడా పార్టీస్పేట్ చేయనున్నాడని తెలుస్తోంది.
Also Read: డబుల్ ఇస్మార్ట్ సింగిల్ ఎంట్రీ కమింగ్ సూన్…
ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీకే హైలైట్గా నిలవనుంది. అంతేకాదు ఈ సీన్ మూవీ ఇంటర్వెల్ సీన్ అని తెలుస్తోంది.అందుకే ఈ మూవీకి హైలైట్గా నిలిచేందుకు భారీ ఖర్చుతో స్టైలిష్ గా ఈ యాక్షన్ సీన్లను దగ్గరుండి మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఈ మూవీని దాదాపు ధూమ్ 2 తరహాలో ఓ ఛేజింగ్ సీన్ ఉంటుందట.
ఇక టాలీవుడ్ మ్యాటర్కి వస్తే ఎన్టీఆర్ పాత్రపైనే అభిమానుల ఫోకస్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్కే ధీటుగా ఉండే ఆ రోల్ నెగిటివ్ టచ్ ఉన్నదని ఇంకా వార్తలు వస్తున్నా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు మూవీ యూనిట్.ఇక ఈ మూవీకి నిర్మాతగా ఆదిత్య చోప్రా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీకోసం ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా,అయాన్ ముఖర్జీ స్టైలిష్ యాక్షన్ త్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ ఏ విధంగా ఆడియెన్స్ని అలరించనుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.