KCR : సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు కేసీఆర్. పాలమూరు సమీకృత కలెక్టేరట్ను ప్రారంభించిన కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిని వివరించారు.గతంలో కరెంట్ కష్టాలు ఉండేవని..ఇప్పుడా ఆపరిస్థితి లేదన్నారు.వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలముూరు ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు కేసీఆర్
గురుకులాలను మూడు, నాలుగు రెట్లు పెంచుతామన్నారు ఏ తెలంగాణ కోసం పోరాడమో ఆ దిశగా వెళ్తున్నామన్నారు కేసీఆర్. కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదన్నారు. త్వరలో రెండో విడత కంటి వెలుగును ప్రారంభిస్తామన్నారు. ఓట్లు కోసం ఈ ప్రోగ్రాం పెట్టలేదన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి బాటలో ఉందన్నారు సీఎం కేసీఆర్