EPAPER

Sonia Gandhi Letter to Speaker: లోక్‌సభలో యువకులకు కాంగ్రెస్ ఛాన్స్, రాహుల్ టీమ్‌లో..

Sonia Gandhi Letter to Speaker: లోక్‌సభలో యువకులకు కాంగ్రెస్ ఛాన్స్, రాహుల్ టీమ్‌లో..

Sonia Gandhi Letter to Speaker: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతుండడంతో విపక్షాలు అలర్ట్ అయ్యాయి. మోదీ సర్కార్‌పై ముప్పేట దాడికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులోభాగంగా లోక్‌సభలో రాహుల్‌కు చేదోడుగా ఉండేందుకు ముఖ్యనేతలను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.


లోక్‌సభలో కీలక పదవులకు అగ్రనాయకురాలు సోనియాగాంధీ నియామకాలు చేపట్టారు. డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగొయ్‌, చీఫ్‌‌ విప్‌గా కె. సురేష్‌, విప్‌గా మాణిక్యంఠాగూర్, మరో విప్‌గా ఎండీ జావైద్‌‌లను నియమించా రు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేకంగా లేఖ రాశారు. నూతనంగా నియామ కమైన వారికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త లోక్‌సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత వారం పాటు సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మోదీ సర్కార్‌పై విపక్షాలు ముప్పేట దాడి చేశాయి. ఇండియా కూటమి తరపున రోజుకో కీలక నేత కొత్త కొత్త అంశాలను తెరపైకి తెచ్చి మోదీ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు.


Also Read:  ‘ప్రజల సంపూర్ణ మద్దతు ఇండియా కూటమికే’.. ఉపఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ..

రాహుల్‌గాంధీ, అఖిలేష్‌యాదవ్ ఇలా అనేక మంది నేతలు.. ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించా యి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడే సమయంలో సభ్యులంతా వినేవారు. గత నెలలో జరిగిన సమావేశాల్లో ఇండియా కూటమి సభ్యులు ప్రధానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చివరకు ఇయర్ ఫోన్ పెట్టుకుని ప్రసంగించాల్సి వచ్చింది ప్రధాని నరేంద్రమోదీ.

Tags

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×