Wimbledon Women’s Singles: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా బార్బొరా క్రెజికోవా నిలిచింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. సంచలనాలకు వేదికగా, అనూహ్య ఫలితాలతో సాగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ గా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) అవతరించింది. శనివారం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ఇటలీకి చెందిన పావోలినిపై 6-2, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ గెలుపొంది జాస్మినెను ఒత్తిడిలో పడేసి, మూడో సెట్ ను విజయంతో ముగించి ఛాంపియన్ గా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్ మనీని క్రెజికోవా సొంతం చేసుకుంది.
Breathtaking. Brilliant. Barbora.
Barbora Krejcikova is the 2024 Ladies’ Singles Champion 🏆#Wimbledon pic.twitter.com/Xz0jjezO89
— Wimbledon (@Wimbledon) July 13, 2024
వింబుల్డన్ ఫైనల్ చేరడం వీరిద్దరికీ ఇదే మొదటిసారి. అయితే, తాజా విజయంతో క్రెజికోవా రెండో గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంది. 2021 ఫ్రెంచ్ ఓపెన లో కూడా క్రెజికోవా విజతేగా నిలిచిన విషయం తెలిసిందే. 2016లో సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచిన తరువాత జరిగిన ప్రతీ వింబుల్డన్ లోనూ మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చారు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది.
"I have to keep smiling" 😄
Even in defeat, Jasmine Paolini can't help but smile 🥹
A new favourite at SW19, we can't wait to see again soon, Jasmine ❤️#Wimbledon pic.twitter.com/FBDFjgAIbY
— Wimbledon (@Wimbledon) July 13, 2024
అయితే, వింబుల్డన్ ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న జాస్మినె కల చెదిరింది. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ గా జేజేలు అందుకున్న ఈ యంగ్ స్టర్ మరోసారి ఫైనల్ లో తడబడింది. ఆడుతున్న తొలి సీజన్ లో వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టిన జాస్మినె మహిళల సింగిల్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ అమ్మాయిగా చరిత్ర నెలకొల్పింది. టైటిల్ పోరులో జాస్మినె గెలిచి ఉంటే వింబుల్డన్ ట్రోఫీ నెగ్గిన మొదటి ఇటలీ టెన్నిస్ ప్లేయర్ గా కొత్త అధ్యాయం లిఖించేది.