EPAPER

Snake bites School Students: పాఠశాలలో కలకలం.. ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము?

Snake bites School Students: పాఠశాలలో కలకలం.. ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము?

Snake bites School Students: గద్వాల జిల్లాలోని ఓ పాఠశాలలో పాము కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులను కాటు వేయడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీసు వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాళలకు చెందిన ముగ్గురు విద్యార్థులను పాము కరిచింది. శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురిని పాము కాటేసింది.


శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్న మైనర్ బాలుడు అనిల్ కుమార్, కేటి దొడ్డి మండలంకు చెందిన సంతోష్ నాయక్, ఐజ మండలంకు చెందిన అర్జున్ కుమార్, గద్వాలకు చెందిన వీరేంద్ర చార్యులను చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ అధికారులు పట్టుకుని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వదిలారు. ఈ నలుగురు విద్యార్థులు శనివారం మూత్ర విసర్జనకు బయటకు వెళ్లారు. అక్కడ పాముకాటుకు గురికావడంతో హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని వైద్యలు తెలిపినట్లు సమాచారం.

Also Read: డ్రగ్స్‌ను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్.. ప్రహరీ క్లబ్స్‌తో నిఘా


విద్యార్థినులను కరిచిన ఎలుకలు..

అదేవిధంగా.. మెదక్ జిల్లా రామాయంపేటలోని గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన మరువక ముందే మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అల్లూరి సీతారామరాజు గురుకులంలోనూ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకులంలో విద్యనభ్యసిస్తున్న నలుగురిని శుక్రవారం ఎలుకలు కరిచినట్లు ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×