Raj Tarun-Lavanya: లావణ్య – రాజ్ తరుణ్ వ్యవహారంపై రోజుకొక కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తుంది. ఈసారి.. లావణ్య ఆత్మహత్య చేసుకుంటానంటూ హైడ్రామా సృష్టించింది. తనను ప్రేమించి, వాడుకుని.. మాల్వీ మాయలో పడి మోసం చేశాడని కేసు పెట్టిన లావణ్య.. రాజ్ తరుణ్ లేని జీవితం తనకు వద్దని, అతను లేకుండా జీవించలేనని వాపోతూ తన అడ్వకేట్ కు మెసేజ్ పంపింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టడంతో.. అడ్వకేట్ వెంటనే 112 కు డయల్ చేసి.. నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అర్థరాత్రి లావణ్య ఇంటికివెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
తానేంటో తెలిసినవారే ఇప్పుడు తనను తప్పుబట్టారని లావణ్య పోలీసుల ఎదుట ఆవేదన చెందిందట. రాజ్ తరుణ్ లేని జీవితం తనకు వద్దని, అతను లేకుండా బ్రతకలేనని చెప్పిందట. అన్నీ కోల్పోయిన తనను.. అందరూ కలిసి మోసం చేశారని తెలిపింది. మాల్వీ మోజులో పడి రాజ్ తరుణ్ తనను దూరంపెట్టాడని చెప్పుకొచ్చింది. తన చావుకు రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులో కారణమని, మాల్వీనే ప్రధాన కారకురాలని తెలిపింది.
Also Read : పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తాను.. ఆయనే న్యాయం చేస్తారు
కాగా.. ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ మల్హోత్రాలపై లావణ్య కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. రాజ్ తరుణ్ కు తనకు పెళ్లైందని లావణ్య ఫిర్యాదులో చెప్పగా.. ఆమెకు చాలాకాలంగా దూరంగా ఉన్నానని, డబ్బులు పంపకపోనందునే తనపై ఆరోపణలు చేస్తుందని చెబుతున్నాడు రాజ్ తరుణ్. లావణ్య ఇదంతా డబ్బు కోసమే చేస్తుందని పేర్కొన్నాడు.