Delhi Crimes : శ్రధ్దా వాకర్ హత్య కేసు లాంటిదే మరో కేసు ఢిల్లీలో సంచలనం సృష్టించింది. రోజురోజుకూ ఇలాంటి పైశాచిక హత్యలు పెరిగిపోతున్నాయి. సహజీవనం చేస్తున్న భార్యను కత్తితో కిరాతకంగా చంపాడు. ఆపె ఆమెను ముక్కులుగా చేస్తుంటే అప్పుడే కూతురుకి మెలుకవ రావడంతో ఆగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ డిళ్లీ తిలక్ నగర్లో రేఖా రాణి, మన్ప్రీప్ సింగ్ గొత కొన్నేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నారు. అంతుకు ముందు వీరు వివాహేతర సంబంధం కొనసాగించారు. రేఖకు 16 ఏళ్ల కూతురు కూడా ఉంది.
ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రేఖను మన్ప్రీత్ సింగ్ అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. రేఖకు నిద్రమాత్రలు ఇచ్చి..కత్తితో ఆమె గొంతు కోసాడు. తరువాత సైకోలా కుడి చేతి వేలిని కోసాడు. అంతలోనే రేఖ కూతురు నిద్ర లేచి ఆ ఘోరాన్ని చూసింది. వెంటనే తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మన్ప్రీత్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మన్ప్రీత్ సింగ్ పై గతంలో అనేక కేసులు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు.