Nandakumar : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ కు కోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫోర్జరీ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో కేసులో నందకుమార్పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. నందకుమార్పై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని పోలీసులను న్యాయస్థానం కోరింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నందకుమార్ చాటింగ్ లో ప్రస్తావించిన పేర్లు కాంగ్రెస్ లో గుబులు రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్లను నందకుమార్ చాటింగ్ లో ప్రస్తావించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేతలందరూ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడరని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విభిన్న కోణాలు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలిమిర.